కూలి పని చేస్తున్న సర్పంచ్

ముస్తాబాద్ సెస్టంబర్ 29 జనం సాక్షి
మండలంలోని మొర్రపూర్ తండాకు చెందిన గ్రామ సర్పంచ్, భూక్య దేవేందర్ తానే స్వయంగా తాపీ చేత పట్టుకొని కూలిగా మారిన సర్పంచి తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ ని నిర్మిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త గ్రామపంచాయతీలు చేయగా నూతన గ్రామ పంచాయతీగా మొర్ర పూర్ తండా ఏర్పడినది, పీజీ చదువుకున్న యువ నాయకుడిని ఆ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచిగా ఎన్నుకున్నారు నూతన గ్రామపంచాయతీ నిర్మాణం కోసం 20, లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినది మంజూరై నెలలు గడుస్తున్న డబ్బులు రాకపోవడంతో లేబర్ తో ఇబ్బంది అవుతుంది గ్రామంలో అప్పులు ఎవరు ఇస్తలేరు గ్రామస్తులు నూతన గ్రామపంచాయతీని ఎప్పుడు నిర్మిస్తారని అడగడం తో ఏం చేయలేక తానే స్వయంగా తట్టా పారచేతను పట్టుకొని నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు ప్రస్తుతం పునాదులు అయిపోయి గోడల నిర్మాణ దశకు వచ్చింది. నెల రోజులలో గ్రామపంచాయతీ పూర్తి చేయనున్నట్లు ఒక పట్టుదలతో ఆ గ్రామ సర్పంచ్ దేవేందర్ కూలి చేస్తున్నా అని తెలిపారు.