కెసి కెనాల్‌లో పడి ఉద్యోగి మృతి

కర్నూలు,అగస్టు21(జనంసాక్షి): జిల్లాలోని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో విషాదం నెలకొంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగి లక్ష్మీకాంత్‌ రెడ్డి( 40), తన పుట్టినరోజే కేసి కెనాల్‌లో గల్లంతయ్యాడు. కెనాల్‌లో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్లిన పిల్లలను లక్ష్మీకాంత్‌ రెడ్డి కాపాడాడు. కేసి కెనాల్‌లో నీళ్లు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో జారిపడి కాలువలో లక్ష్మీకాంత్‌ రెడ్డి గల్లంతయ్యాడు. లక్ష్మీకాంత్‌ రెడ్డి ఆచూకీ కోసం అధికారులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు.