కొడుకు చేతిలోనే ఓ తండ్రి మృత్తి

తెలకపల్లి: మండల పరిధిలోని ఆలేరు గ్రామంలో కొడుకు చేతిలోనే ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తగిలి రాములు (65) అనే వ్యక్తిని తన కుమారుడైన రామకృష్ణ (28) కత్తితో తీవ్రంగా గాయపరచడంతో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. రామకృష్ణ నిత్యం తాగుతూ తండ్రిని డబ్బుల కోసం వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం వివాదం జరగడంతో రామకృష్ణ కత్తితో తన తండ్రిపై దాడిచేసి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి రావడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.