కోరుకొండపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ….

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి
కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి / కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామం లో శుక్రవారం రోజున బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం స్థానిక సర్పంచ్ నాగెల్లి జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్,జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి హాజరై బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుజ్జనూరి రాజు, టిఆర్ఎస్ మండల పార్టీ ఉప అధ్యక్షులు పనికర కొమురమళ్లు , రైతు కో ఆర్డినేటర్ పనికర యాకుమల్లు,గ్రామ పార్టీ అధ్యక్షులు బిరం రామ్మోహన్ రెడ్డి,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి మధు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పల్ రెడ్డి,సమాకూరి నర్సయ్య, చేలాగోలా అనిల్, భూక్యా విజేందర్, లకావత్ వెంకన్న, భూక్యా వెంకన్న, బేతూ రమేష్,గోపతి సుధాకర్,గుజ్జునూరి రామస్వామి,పోలేపక సైదులు,నాగేల్లి దేవేందర్, నాగేల్లి అయిలయ్య, మంకాల వెంకన్న యూత్ సభ్యులు కాసాని వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area