కౌలాస్ లో గ్రంధాలయం ప్రారంభించిన కలెక్టర్

జుక్కల్, అక్టోబర్ 11,( జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం గ్రంధాలయం ను ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంధాలయం ను ఉపయోగించుకోవాలని తెలిపారు. పుస్తక పఠనం ద్వార విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నా రు.ఈ గ్రంథాలయానికి ఫర్నీచర్, పుస్తకాలు అందజేసిన కెనరా బ్యాంక్ జిల్లా అధికారులను కలెక్టర్, ప్రశంసించారు. కెనరా బ్యాంక్ వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించడంతో పాటు సామాజిక కార్యక్రమాలలో కూడా ముందున్నదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.