*క్యారమ్స్ విభాగంలో జాతీయ స్థాయికి ఎంపిక*

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 30 : మండల పరిధిలోని వల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులగా విధులు నిర్వహిస్తున్న వనపర్తి నివాసి చౌదరి మనోహర్ క్యారమ్స్ విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఈ నెల 25, 26 తేదిలలో హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఉద్యోగులకు సివిల్ సర్విసెస్ స్ఫోర్స్ అండ్ గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చౌదరి మనోహర్ క్యారమ్స్ రాష్ట్ర స్థాయి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. జాతీయ స్థాయికి ఎంపిక రావడం పట్ల హర్షం వ్యక్తం చేసి ఉపాధ్యాయుడిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కావలిమన్యం, షాఆలం, వెంకటేశ్వరమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.