క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించిన పివి సింధు

చైనాకు చెందిన జాంగ్‌ యీ పై విజయం
కౌలాలంపూర్‌,జూలై7(జ‌నంసాక్షి): భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ.. క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది . కౌలాలంపుర్‌ వేదికగా జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 21`12, 21`10 తేడాతో చైనాకు చెందిన జాంగ్‌ యీపై సింధు విజయం సాధించింది.
రెండు సార్లు ఒలింపిక్‌ విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపుర్‌ వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సింధు.. 21`12, 21`10తో జాంగ్‌ యీ(చైనా)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ 28 నిమిషాల్లోనే ముగిసింది. అంతకుముందు బుధవారం జరిగిన తొలి రౌండ్లోª` చైనాకు చెందిన హి బింగ్‌ జియావొపై సింధు గెలిచింది.
21`13,17`21,21`15 తేడాతో విజయం సాధించింది. మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో గెలిచి.. రెండో రౌండ్‌ చేరుకున్న భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌కు నిరాశ ఎదురైంది. చైనాకు చెందిన లీ షి ఫెంగ్‌ చేతిలో 14`21, 17`21 తేడాతో ఓటమి పాలయ్యాడు.