గంజాయి తోటలపై దాడులు

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని రేపాకలిపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న గంజాయి తోటలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఎక్సైజ్‌ శాఖ పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన గుల్ల నర్సయ్య, గుల్ల భిక్షపతి అనే ఇద్దరు రైతులు తమ పంట చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న సమాచారమందుకున్న అధికారులు పంటలను పరిశీలించారు. అక్కడ ఉన్న దాదాపు 11 వందల గంజాయి మొక్కలను తగులబెట్టారు. వాటి విలువ మార్కెట్‌లో ఐదు లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు. నిందితులు పరారీలో ఉండటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.