గద్వాలపై వివక్ష వద్దు

5

– డికె అరుణ

హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్‌, గద్వాల్‌ పట్ల వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.గద్వాలను కేవలం కాంగ్రెస్‌ కోసం వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. గురువారం ఆమె  విలేకరులతో మాట్లాడుతూ..గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ప్రజల ఆక్షాంక్షను క్యాబినేట్‌ సబ్‌ కమిటీలో స్పష్టంగా చెప్పామన్నారు. అన్నివనరులు , భౌగోళిక అనుకూలతలు గద్వాలకు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏ గైడ్‌లైన్స్‌ ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కొత్త ఏర్పాటు చేయబోయే 17 జిల్లాల్లో గద్వాల పేరు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం గద్వాల కేంద్రంగా ఆలంపూర్‌, మక్తల్‌ నియోజకవర్గాలతో కలిపి జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. అఖిలపక్షంలో అయినా గద్వాల జిల్లాపై ప్రకటన చేయాలన్నారు.