గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలి

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 10 శాతం గిరిజన రిజర్వేషన జీవో ను వెంటనే విడుదల చేయాలని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ రవిచంద్. ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేని వేళలో లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముడ్డిస్తామని హెచ్చరించారు.మాట్లాడుతూ సెప్టెంబరు 17న ఆదివాసీ, గిరిజన భవన్ ప్రారం భించిన సీఎం కెసిఆర్.. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సభలో రిజర్వేషన్లను 6శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నామని.. వారం రోజుల్లో జీవో ఇస్తామని ప్రకటించారని ఆయన మాట ఇచ్చి పదిరోజులైనా ఇప్పటికీ జీవో ఊసే లేదన్నారు. కావున మూడురోజుల్లో ఆ జీవో విడుదల చేయాలని లేనిపక్షంలో ఉద్యమన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.