*గిరిజన బంధు ఓట్ల కోసమే*

   బీఎస్పీ నాయకులు రాంబాబు*
*ఇటిక్యాల జనంసాక్షి (సెప్టెంబర్ 19)* గిరిజనులకు గిరిజన బందు ప్రకటించినాది మునుగోడు ఓట్ల కోసమే అని బిఎస్పి నాయకుడు రాంబాబు అన్నారు. మండలంలో ని పెద్దదిన్నె గ్రామంలో బిఎస్పి నాయకులు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన బిడ్డ  ద్రౌపది ముర్ముకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆకేపోగు రాంబాబు అన్నారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఆయన అన్నారు  రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన బిడ్డ అయిన ద్రౌపతి ముర్మును  ఓడించడానికి దేశంలోని ముఖ్య నాయకులను ఏకతాటిగా తెచ్చిన ఘనత కేవలం కేసీఆర్ కు  దక్కుతుందన్నారు. ఇప్పుడు గిరిజన బిడ్డలపై ప్రేమను కుమ్మరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని గిరిజన ఉపకలాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రికే చెందుతుందన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల పేరుతో గిరిజన బిడ్డలపై ప్రేమను  వలక  పోస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికల కోసమే గిరిజన బిడ్డలపై రిజర్వేషన్లు మరియు  గిరిజన బంధు అంటూ ప్రేమను వలకబోస్తున్నారని అన్నారు. మునుగోడులో జరిగే ఎలక్షన్లలో బహుజన బిడ్డలు అధికారంలోకి వస్తారని అన్నారు.ఆయన వెంట బీసన్న మరియు గ్రామ ప్రజలు ఉన్నారు.
Attachments area