గిరిజన రిజర్వేషన్ పెంచిన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రుద్రంగి అక్టోబర్ 2 (జనం సాక్షి)
రుద్రంగి మండలంలోని బడి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉమ్మడి మానాల తండాల నాయకులు ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అనేది ఎన్నో దశాబ్దాల కల గిరిజనుల చిరకాల స్వప్నం ఆ కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు రుణపడి ఉంటామని,అందరూ కలిసి మా జాతి కోసం చేసిన మేలును మర్చిపోకుండా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా గుర్తుపెట్టుకుంటామన్నారు.అలాగె ప్రతి తండా జాతి పక్షాన ఎప్పటికీ రుణపడి ఉంటామని,గిరిజనుల కుటుంబంలో వారి కళ్ళల్లో దసరా పండుగకు ముందే మనకు సంతోషాన్ని అందించిన మహానీయుడు కేసీఆర్ అని అన్నారు.అలాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి కి పాదాబివందనాలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.