గిరిజన విద్యార్థి సంఘం పరిగి తాలూకా కార్యదర్శిగా బలరాం నాయక్

కుల్కచర్ల, జులై 28(జనం సాక్షి):
కుల్కచర్ల మండల పరిధిలోని గిరిజన విద్యార్థి సంఘం ప్రాంతీయ కార్యాలయంలో గురువారం గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో గోరిగడ్డ తాండ కుసుమసముద్రం వాసి వడిత్య బలరాం నాయక్ ను గిరిజన విద్యార్థి సంఘం పరిగి తాలూకా కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమించారు.ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ..గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు విద్యార్థుల సమస్యలపై ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ గిరిజన విద్యార్థి సంఘం ముందుకెళ్తుందన్నారు. గిరిజన విద్యార్థి సంఘంలో తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం చాలా గర్వకారణంగా ఉందని బలరాం నాయక్ చెప్పుకొచ్చారు.సంఘం బలోపేతానికి కృషి చేస్తూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని,జాతి పట్ల ఏ సమస్య కోసమైనా పోరాడుతానని బలరాం నాయక్  పేర్కొన్నారు.గిరిజన విద్యార్థి సంఘంలో పరిగి నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జీవీఎస్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు బాలునాయక్, మండల కార్యవర్గ సభ్యులు సంతోష్ నాయక్, విష్ణు నాయక్, రాంచంద్రనాయక్, సోమ్లా నాయక్, సంజీవ్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area