గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 19 : గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో మృతదేహం లభ్యంకాగా…. ఈ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది… అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈమె ఆత్మహత్యకు పాల్పడిందా.., లేక ఎవరైనా హత్య చేసి తీసుకు వచ్చి ఇక్కడ పడేశారా… అన్న కోణంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.