గుర్తు తెలియని వ్యక్తులు కిరాణా వ్యాపారి హత్య

మహబూబ్‌నగర్‌: పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్‌లో కిరాణా వ్యాపారి రాజు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి వ్యాపారిపై దాడి చేసి కత్తితో గొంతుకోశారు. అతను అక్కడికక్కడే మరణించాడు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.