గ్రామానికి విద్యుత్‌ షాక్‌ : ఒకరు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని వనపర్తి మండలం రాజపేటతాండ గ్రామం మొత్తానికి విద్యుత్‌షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ధర్నా చేపట్టారు.