ఘనంగా వన మహోత్సవం
జహీరాబాద్ ఆగష్టు 10, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో బంగంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ పట్టణం లోని పోలీస్ స్టేషన్ అవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల మొక్కలు నాటారు. వజ్రోత్సవ వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజా భాగస్వామ్యంతో నిర్వహిస్తూ, ప్రజలకు భారతదేశ స్వాతంత్ర్య చరిత్ర, గొప్పతనం గురించి ప్రజలకు వివరించేందుకు కృషి చేయడం జరుగుతుందని పలువురు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘు,.మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాష్, డీసిసి డైరెక్టర్ కిషన్ రావ్ పవార్,మాజీ మార్కెట్ గుండప్ప, తెరాస పట్టణ అధ్యక్షుడు సయ్యెద్ మోహిుద్దీన్,మొగుడపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,ఆలయ చైర్మన్ వెంకటేశం,మాజీ కౌన్సిలర్ యూనిస్,విజిలెన్స్ మెంబర్ రామకృష్ణ బంట తెరాస నాయకులు ఇజ్రాయెల్ బాబీ,ముత్యాల చందు,
సత్యం ముదిరాజ్,మూర్తుజా,
సలీమ్, సర్పంచ్ రాజు,లవన్,సుకుమార్,
పోలీస్ శాఖ ,సి.ఐ.,స్థానిక ఎస్.ఐ. పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.