చత్తీస్ఘడ్లో ఎన్కౌంటర్
రాయ్పూర్,ఆగస్టు 17(జనంసాక్షి): ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.. దంతెవాడ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. కాంకేర్ జిల్లాలో 12కు పైగా మావోయిస్టుల క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. క్యాంపుల నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలను భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. దంతెవాడ జిల్లాలో ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక పోలీసు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.