*చిట్యాల తాత్కాలిక సర్పంచ్ గా ఆకుల రవీందర్.

 చిట్యాల సెప్టెంబర్1( జనంసాక్షి) చిట్యాల తాత్కాలిక సర్పంచ్ గా తొమ్మిదవ వార్డు సభ్యులు ఆకుల రవీందర్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు నియమించినట్లు శనివారం ఎంపీడీవో రామయ్య తెలిపారు. గత సర్పంచ్ మాసు రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా, ఉపసర్పంచ్ పూర్ణచందర్ కు ఇన్చార్జ్ సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టారు. రైతు వేదిక నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు చేయడంతో అతనిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనంతరం రెండవ వార్డు సభ్యులు పుల్ల రజితను తాత్కాలిక సర్పంచ్ గా నియమించడంతో ఆమె ఒక నెల బాధ్యతలను నిర్వర్తించి తన వ్యక్తిగత కారణం, కుటుంబ పరిస్థితుల వలన రాజీనామా చేశారు. చిట్యాల గ్రామపంచాయతీ రోజువారి దృష్ట్యా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 38(3) ప్రకారం తదుపరి ఉత్తర్వులు చేయువరకు తొమ్మిదవ వార్డు సభ్యులు ఆకుల రవీందర్ ను తాత్కాలిక సర్పంచ్ గా నియమించడమైనదని పేర్కొన్నారు.