చిన్నారి శ్రియ పోస్టుమార్టం పూర్తి

మహబూబ్‌ నగర్‌: కిడ్నాపర్ల చేతిలో హతమైన చిన్నారి శ్రియ పోస్టుమార్టం శుక్రవారం పూర్తైంది. పోస్టుమార్టం అనంతరం శ్రియ మృతదేహన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న మొన్నటి వరకు కళ్లముందు కళకళలాడిన శ్రియ విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండా పోయింది.
జిల్లా కలెక్టర్‌ గిరిజా శంకర్‌ ప్రసాద్‌, శ్రియ తల్లిదండ్రులను పరామర్శించారు. మరోవైపు శ్రియను హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మహబూబ్‌ నగర్‌లో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు సకాలంలో స్పదించి ఉంటే శ్రియ బతికి ఉండేదని ప్రజా సంఘాల నేతలు వ్యాఖ్యానించారు.