చెక్కును అందజేసిన ముల్లిపావని

ఘట్కేసర్ జూన్ 29 (జనం సాక్షి) ఈరోజు ఘట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేద కు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ .పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఈ పథకం ద్వారా చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ యొక్క పథకం పేదలకు వరం అని, ఘట్కేసర్ మున్సిపాలిటీ 17వ వార్డు కు చెందిన సిహెచ్ వెంకటేష్ కి అనారోగ్య ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయల చెక్కును మంత్రి చామకూర మల్లారెడ్డి సహకారంతో అందించారు, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని చెప్పారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ బేతల నర్సింగరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బర్ల హరీష్ శంకర్, మాజీ వార్డు సభ్యుడు శేఖర్ గుప్తా, టిఆర్ఎస్ నాయకుడు పల్లె విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.