ఛార్జీషీటు పూర్తి కానందున మళ్లి న్యాయస్థానంకు హాజరు కావలేను

మహబూబ్‌నగర్‌: ఈ కేసులో ఛార్జిషీటు ఇంకా దాఖలు కాలేదని, ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత మరోసారి న్యాయస్థానం ముందు హాజరు కావాలని కోదండరాం బృందాన్ని అలంపూర్‌ న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్‌ గడువు ముగియడంతో ఐకాస, తెరాస నేతలు ఈరోజు న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల తర్వాత బయట విలేకరులతో మాట్లాడుతూ కోదండరాం ఇది గుడ్డి  ప్రభుత్వమని, శాంతియుతంగా ఉద్యమం చేసుకుంటున్న తమను కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతోందని వ్యాఖ్యానించారు. అరెస్టులు, జైళ్లతో ఉద్యమాన్ని ఆపలేరని, మరో సడక్‌బంద్‌పై రేపు స్టీరింగ్‌ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం వారంతా స్థానిక జోగులాంబ ఆలయానికి దర్శనం నిమిత్తం వెళ్లారు.