జర్నలిస్టు కుటుంబ పిల్లలకు 50% ఫీజు రాయితీ…

 నిర్మల్ బ్యూరో, అక్టోబర్13,జనంసాక్షి,,,  జర్నలిస్టు కుటుంబంలోని పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలని టియుడబ్ల్యూజే ( ఐజేయు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. స్పందించిన విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, సీనియర్ సూపరిండెంట్ భోజన్న లు వెంటనే 50% ఫీజు రాయితీ కల్పిస్తూ సర్కులర్ జారీ చేసి, మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకగారి భూమయ్య,
జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మల అశోక్,పోశెట్టి,ఆర్గనైజర్ సెక్రటరీ రసిద్ అలం,సంయుక్త కార్యదర్శులు కున రాజు,ప్రచార కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.