జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కుల్కచర్ల,అక్టోబర్ 2(జనం సాక్షి):                        కుల్కచర్ల మండల పరిధిలోని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్  లక్ష్మీ ఆనంద్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సర్పంచ్ లక్ష్మి ఆనంద్ మాట్లాడుతూ..గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అనే ఆశయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.అహింస మార్గంతో భారతదేశ స్వతంత్రానికి తోడ్పాటు చేసిన మహానీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన చేసిన మంచి పనులను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్, ఉప సర్పంచ్ చంద్ర భూపాల్ రావు, కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్, కో ఆప్షన్ మెంబర్ మైమూద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివకుమార్, పులింగ చిన్న వెంకటేష్, ఉప్పరి చెన్నయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ అనంతయ్య, కారోబార్ యాదయ్య, కృష్ణయ్య, వెంకటయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
Attachments area