*జాతీయస్థాయి కోకో అకాడమీకి కేజీబీవీ విద్యార్థిని ఎంపిక*

బాల్కొండ సెప్టెంబర్ 27(జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయానికి చెందిన ఏ సృజన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక కావడం జరిగింది, సెప్టెంబర్ రెండవ వారం గుజరాత్ రాష్ట్రం లో నిర్వహించిన ఎంపికల్లో ఉత్తమ ప్రదర్శన ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరే ఎంపిక కావడంతో ఎంపికైన క్రీడాకారిణి కెసిపి సిమెంటు సంస్థల అధినేత సాగర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు, మారుమూల గ్రామం నుంచి దేశంలోని ఉత్తమ క్రీడా శిక్షణ సంస్థకు ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకం అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల విద్యాధికారి బి రాజేశ్వర్,రాజ్ కుమార్,ఫిజికల్ డైరెక్టర్,
నిజాంబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కే. గంగాధర్,సీనియర్ క్రీడాకారులు T.సాయన్న,గంగారం,
పీఈటీలు స్రవంతి, మధు, తదితరులు పాల్గొన్నారు