జెఎన్టీయూలో వనమహోత్సవం


అనంతపురం,ఆగస్ట్‌5( జనంసాక్షి): అనంతపురం జెఎన్టీయులో 72 వ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా జిల్లా సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు 72వ వనమహోత్సవం కార్యక్రమం జరిగింది. స్థానిక జె ఎన్‌ టి యు నందు నిర్వహించారు. ఈసందర్భంగా జెఎన్టీయులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి జగనన్న పచ్చతోరణం ఉద్ధేశ్యం గురించి పలువురు వక్తలు వివరించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జెఎన్టీయు ఆవరణలో మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో జెఎన్టీయు వి.సి రంగ జనార్ధన్‌ , జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి ఎఖా , జాయింట్‌ కలెక్టర్‌ సిరి, జిల్లా సామాజిక అటవీ విభాగం అధికారి శ్రీనివాస శాస్త్రి, డి ఎఫ్‌ ఓ సందీప్‌ , జెఎన్టీయు ప్రిన్సిపాల్‌ సుజాత, తదితరులు పాల్గొన్నారు.