జె పి ఏ ప్రమాద బీమా చెక్కు ను పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు

ఎల్లారెడ్డి,08 అక్టోబర్  (జనం సాక్షి): ఎల్లారెడ్డి ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘం లి. లో  సోమిర్యగాడి  తండాకు చెందిన  హున్య నాయక్ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో లోన్ తీసుకున్నందున ప్రాథమిక సహకార సంఘం ద్వారా సభ్యునికి జెపిఎ ఇన్సూరెన్స్ చేయించారు. హున్య నాయక్ ప్రమాదవశాత్తు   మరణించడం జరిగింది.కావున అతని భార్య సమ్ని కి జె పి ఏ ఇన్సురెన్స్ ద్వారా 1,00,000/- రూపాయల చెక్కును సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు  అందించారు.  ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నాగం గోపికృష్ణ, యం. సూర్య ప్రకాష్, యం. పౌలయ్య,                  వై. బాలరాజు, ఎల్  లక్ష్మణ్, సిహెచ్. టీవీ సుఖేందర్ రెడ్డి , ఎన్. నర్సింలు, మరియు సీఈవో విశ్వనాధం, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.