జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న న్యాయమూర్తి

ఆలంపూర్‌: ఐదో శక్తి పీఠమైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.