జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ చోరీ

గద్వాల ఆర్సీ జనంసాక్షి సెప్టెంబర్ 19

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మోమిన్ మొహల్లా సమీపంలో గల 24 వ వార్డు రహెమత్ నగర్ కాలనీలో రిహాన్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు.బాధితుడు రిహాన్ తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి అత్త మామాల ఊరైనటువంటి రాయచూరుకు వెళ్లామని అన్నారు .ఈ రోజు ఉదయం వచ్చి చూస్తే ఇల్లు తాళం విరగొట్టి ఉండడం చూసి ఇంట్లో ధోగ్గతనం జరిగిందని భావించి పోలీసులకు పిర్యాదు చేషామని అన్నారు .సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు వేలి ముద్రలు తీసుకుని పంచనామా చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంట్లో చొరబడి బీరువా లో పెట్టిన 6 తులాల బంగారం, 2,10,000/ నగదు అపహరించారని రిహాన్ పోలీసులకు సమాచారం అందించారు.