టిడిపి నేతలకు మతి భ్రమించింది

మండిపడ్డ మంత్రి నారాయణస్వామి
అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఎల్లోవిూడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన
మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేయలేదా అని మండిపడ్డారు. బాబు ఇచ్చిన హావిూలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారని, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, కాలువ శ్రీనివాస్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్‌దే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షపాతిగా సీఎం వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్నారని చెప్పారు.