టి ఆర్ ఎస్ ను గద్దె దింపుతేనె అసలైన తెలంగాణ విమోచనం…

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి…

బతుకమ్మ సంబరాల్లో  పాల్గొన్న  రచన రెడ్డి తో రాష్ట్ర నాయకులు బేన్ల పోచన్న బత్తిని దేవేందర్

ఎల్లారెడ్డి: 30 సెప్టెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి రామాలయం  అవరన లో  బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ రచన రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజేపీ రాష్ట్ర   అధికార ప్రతినిధి , హై కోర్ట్ అడ్వాకేట్ రచనా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్  అధికారంలోకి  రాక ముందు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి అధికారం లోకి వచ్చిన తరువాత విస్మరించారు అని టి ఆర్ ఎస్ పార్టీని గద్దె దించుతే నే అసలైన విమోచనం అని అన్నారు. కల్వ కుంట్ల కవిత హైదరా బాద్ లోని అడ్వకేట్ జెఎసి  వద్దకు వచ్చి బతుకమ్మ అంటే కవిత కవిత అంటే బతుకమ్మ అని అంటే అడ్వ కెట్ జే యి సి ఒక్కసారి గా విరుచుకుపడి తరిమి తరిమి కొట్టిన సందర్భం వుందని గుర్తుకు  తెచ్చుకోవాలని సభ ముఖంగా అన్నారు  అడ్వకేట్. లతో పెట్టుకుంటే  ఏమవుతుందో  కవితకు తెలుసని అన్నారు త్వరలోనే  టి ఆర్ ఎస్ పార్టీ నీ గద్దె దింపుతామని పేర్కొన్నారు అనంతరం  బి జే పీ రాష్ట్ర నాయకులు     బై డ్ల  పోచన్న  బత్తిని దేవేందర్. ఓంకార్ నాయక్ లు మాట్లాడుతూ  టి ఆర్ యస్  కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు గునపాఠం నేర్పు తారని అన్నారు అనంతరం రచన రెడ్డి మహిళలతో కలసి  బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవేందర్, బైండ్ల పొచ్చన్న , పార్టీ నాయకులు రాజేష్, ఓంకార్, మర్రి బాలకిషన్, రవి గౌడ్ , గంపల వెంకన్న, కుర్మా సాయిబాబా, బీజేపీ మహిళ నాయకురాల్లు హారిక .సుజాత మరియు బి జె పి కార్యకర్తలు ఆయా గ్రామాల మహిళలు పాల్గొన్నారు…