టీఆర్ఎస్ పేదల ప్రభుత్వం అలంపూర్ శాసనసభ్యులు డా.వి.యం.అబ్రహం

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్22)టీఆర్ఎస్ పేదల ప్రభుత్వంఅని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంఅన్నారు.
అలంపూర్ మండల పరిధిలో గొందిమల్ల గ్రామంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య ఉప ఆరోగ్యకేంద్ర భావననిపునర్ ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన అలంపూర్ శాసనసభ్యులు డా.వి.యం.అబ్రహం అనంతరం అయన బతుకమ్మ చీరాల పంపిణీ, దళిత బందు పథకంలో భాగంగా లబ్దిదారునీకి కారు పంపిణీ చేశారు. అనంతరం అలంపూర్ మున్సిపాలిటినందు 8,9 వార్డులలో బతుకమ్మచీరాల పంపిణీమరియు ఆసర పెన్షన్ కార్డులుపంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలప్రభుత్వ అని టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మనోరమ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్లు,ఎంపీటీసీలు మరియు అధికారులు,కో మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులుఉన్నారు.