టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు

భూత్పూర్‌: అడ్డాకుల మండలం జానంపేట, కాటవరం గ్రామాల్లో జాతీయ రహదారిపై తెలంగాణ ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారి పరిశీలనకు వచ్చిన ఎస్పీ నాగేంద్రకుమార్‌ తన సిబ్బందితో నిప్పంటించిన టైర్లను తొలగింపచేశారు.