ట్యాంకర్‌ పేలుడు..రెండు ఇళ్లు ధ్వంసం


విజయనగరం,ఆగస్ట్‌23(జనంసాక్షి): పట్టణంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్‌ సవిూపంలో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలింది. కాకినాడ నుండి వచ్చిన గ్యాస్‌ టాంకర్‌కు మరమ్మతులు చేస్తుండగా ఖాళీ టాంకర్‌ పేలినట్లు సమాచారం. పేలుడు దాటికి ప్రక్కనే ఉన్న రెండు ఇళ్ళు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయందోళనకు గురైయ్యారు. ఈ ఘటనలో గ్యాస్‌ వెల్డింగ్‌ చేస్తున్న ఒకరికి గాయాలు అయ్యాయి. అతడిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ పేలుడు జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఖాళీ ట్యాంకర్‌ కావడంతో భారీ ప్రమాదం తప్పిందని వారు తెలిపారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.