ట్రాక్టరు బోల్తా పడి యువకుడి మృతి

దేవరకద్ర: దేవరకద్ర మండలం బలుసుపల్లి వద్ద ట్రాక్టరు బోల్తా పడి ఒక యువకుడు మృతి చెందాడు. బలుసుపల్లికి చెందిన యల్లప్ప (20) ట్రాక్టరు మీద వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టరు డ్రైవరు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయాడు. దీంతో అదుపు తప్పి ట్రాక్టరు బోల్తా పడింది. డ్రైవరు పక్కన కూర్చున్న యల్లప్ప అదే ట్రాక్టరు కిందే పడి మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.