డివైడర్‌ను ఢీకొట్టిన కారు..- ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు


– మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
గద్వాల, జ‌నం సాక్షి ) :  ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రుల్ని సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  డ్రైవర్‌ అలక్ష్యమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కర్నూల్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లో వివాహ వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పుల్లూరు వద్దకు రాగానే అదుపు తప్పి కారు బలంగా
డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ అండ్‌ ఓనర్‌ కిరణ్‌సింగ్‌ (54) అతని కూతుర్లు అక్షిత బాయ్‌, శారద బాయ్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య విజయలక్ష్మీ (47), కుమారుడు విజయ్‌సింగ్‌ (10) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.