డీసీఎం వ్యాన్‌ బోల్తా-ఒకరి మృతి

కొత్తకోట (గ్రమీణం):  డీసీఎం వ్యాన్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని కనిమెట్ట వద్ద చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వరరావు కథనం ప్రకారం వరంగల్‌ చిట్యాలకు చెందిన శ్రీనివాసులు (28) పశువుల వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌ వైపు డీసీఎం వ్యానులో వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను జిల్లా కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.