డ్రంకన్ డ్రైవ్ కెసులొ ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష 200 జరిమానా..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్27 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కెంద్రంకు చెందిన ఒకరికి డ్రంకన్ డ్రైవ్ కెసులొ రెండు రోజుల జైలు శిక్ష 200 రూపాయల జరిమానా విదించినట్లు దోమకొండ యస్ఐ సుధాకర్ తెలిపారు. అయన తెలిసిన వివరాల ప్రకారం పట్టణంకు చెందిన పనస  అవినాష్ తండ్రి తులసిదాస్(26) కు మద్యం సెవించి వాహనం నడిపినందున  మంగళవారం కామారెడ్డి  ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ప్రతాప్,  నిందితుడికి రెండు రొజుల జైలు శిక్ష రెండు వందల రుపాయల జరిమానా విధించారన్నారు.  వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని యస్ ఐ సుధాకర్  సూచించారు.