తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు

కరీంనగర్‌/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో మార్కెట్లకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తమ ధాన్యం తడిసిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తమ ధాన్యాన్ని కొనాలంటూ కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల కొత్త బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట తమకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.