తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ బిందెలతో రాస్తారోకో

ధన్వాడ: తాగునీటి సమస్య పరిష్కరించాలని చిన్నగరపల్లి గ్రామస్థులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని బోర్లన్నీ వట్టిపోయాయని… తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.