తాడ్వాయి గణపవరం వరద ప్రాంతాలను పరిశీలించిన అధికారులు

మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): ఇటివల కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన తాడ్వాయి గురప్పవాగు, గణపవరం బ్రిడ్జిలను శనివారం కోదాడ ఆర్డిఓ కిశోర్ కుమార్ పరిశీలించారు. అనంతరం తాడ్వాయి గ్రామానికి చెందిన షేక్ సైదులు (34) అనే వ్యక్తి చిలుకూరు మండల బేతవోలు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతను నాయనమ్మ ఇంటి వద్ద మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి వస్తుండగా వాగు దాటే క్రమంలో ఉదృతంగా వస్తున్న వాగులో పడి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై వచ్చి వాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహశీల్డార్ నాగేశ్వరరావు, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, సిఐ పి. ఆంజనేయులు, ఎస్సై యన్ బాలునాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శి సతీష్, పోలీసు అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.