తాసిల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన వీఆర్ఏలు

ఝరాసంగం అక్టోబర్ 10( జనం సాక్షి) మండల కేంద్రంలో ని ఝరా సంగం తాసిల్దార్ కార్యాలయానికి సోమవారం వీఆర్ఏలు దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వీఆర్ఏల జేఏసీ 78వ రోజు నిరవధీక సమ్మెలో భాగంగా రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు ఉదయం 10-00 గంటల నుండీ మధ్యాహనము 12-30 గంటల వరకు తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతూ కార్యాలములోకీ ఏవ్వరు రాకుండా నిర్బంధము చేయడం జరిగింది వీఆర్ఏల యొక్క సమ్మె ప్రభావం రాష్ట ప్రభుత్వానీకీ తమ ద్వారా తేలీయజేయాలనీ కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో వి ఆర్ ఏ లు శ్రీశైలం బీరన్న సాయిలు దత్తు రాణి మమత మధులత నర్సిములు తదితరులు పాల్గొన్నారు.