*తెరాస మండల పార్టీ కార్యాలయం ప్రారంభం!

లింగంపేట్ 14 (జనంసాక్షి)
 లింగంపేట్ మండల కేంద్రంలోని న్యూ సొసైటీ కాంప్లెక్స్ భవనంలో ఆదివారం తెరాస మండల పార్టీ కార్యాలయంలో ప్రారంభించినట్లు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేష్ తెలిపారు.మండలంలోని వివిధ గ్రామాల కార్యకర్తలకు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండేందుకు మండల కేంద్రంలోని న్యూ సొసైటీ కాంప్లెక్స్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.స్వాతంత్ర వజ్రోత్సవాల్లో తెరాస కార్యకర్తలు ప్రజలందరు. బాగస్వాములు కావలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్,ఎంపీటీసీలు తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.