త్యాగాల చరిత్ర కలిగిన విప్లవ విద్యార్థి సంఘం పిడిఎస్యు

పిడిఎస్యు సభ్యత నమోదు కార్యక్రమంలో
-జిల్లా నాయకులు భానోత్ దేవేందర్

కురవి సెప్టెంబర్-21 (జనం సాక్షి న్యూస్)

ఎంతో త్యాగాల చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం పిడిఎస్యు అని పిడిఎస్యు జిల్లా నాయకులు భానోత్ దేవేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని గుండ్రాతి మడుగు, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పిడిఎస్యు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించి మంచి నాణ్యతమైన భోజనం అందించాలని కోరారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా నాయకులు భానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. జార్జి రెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి లాంటి ఎందరో విద్యార్థి రత్నాలు తమ ప్రాణాలను అర్పించి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు శాస్త్రీయ విద్య సమాన విద్య కావాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పిడిఎస్యువిద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పిడిఎస్యు లో చేరడం అంటే సమాజంలో నెలకొన్న అసమానతలను వ్యతిరేకించడమే అని అన్నారు. నేడు దేశంలో జరుగుతున్న మతోన్మాద ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలంటే ప్రతి విద్యార్థి ప్రగతిశీల భావజాలంతో దృఢంగా నిలబడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భుక్య సతీష్, కళ్యాణ్, శ్యామలత, సుప్రియ, మహేందర్, జైపాల్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.