*త్రిశక్తి ఆలయంలో ఘనంగా దుర్గాదేవి మాతకు మంగళహారతి బోనాలు*

మెట్పల్లి పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున సాయంత్రం త్రిశక్తి ఆలయంలో దుర్గామాత బోనాలు ఘనంగా నిర్వహించారు. త్రిశక్తి ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు మంగళారతి బోనాలతో దుర్గామాత మండపం నుండి భూదేవి పోచమ్మ దేవాలయం వరకు వెళ్లి భూదేవి ఆలయం పోషమాలే అమ్మవార్లకు మంగళహారతి బోనాలు చూయించి అక్కడ పూజా కార్యక్రమం చేసి అనంతరం తిరిగి త్రిశక్తి ఆలయంలో దుర్గామాత మండపం వద్ద దుర్గామాతకు ప్రత్యేక నిష్ట నియమాలతో పెద్ద ఎత్తున బోనాలు తీశారు .
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ధ్యానపల్లి రాజారాం, శ్రీనివాస్, బెతు భాస్కర్ ,ధ్యానపల్లి గణేష్, గుజ్జేటి శ్రీనివాస్ ,జోగ జగదీశ్వర్ ,సంబారి శ్రీనివాస్, భక్తులు పెద్ద ఎత్తున మహిళ ఆడపడుచులు పాల్గొన్నారు