దాసరిపల్లి లో జాతిపిత మహాత్మకు ఘన నివాళి

జనం సాక్షి, నర్సంపేట

మండలంలోని దాసరిపల్లి గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గ్రామ సర్పంచ్ పెండ్యాల శ్రీనివాస్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గంలో దేశ స్వాతంత్రాన్ని సాధించి అహింసా మార్గమ్ తోనే ఏదైనా సాధించవచ్చునే తన ఆశయాలను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ పెండ్యాల శ్రీనివాస్, కార్యదర్శి సుల్తానా, మల్టీ పర్పస్ వర్కర్ అంకూస్ గౌడ్,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు