దుర్గాదేవి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

రుద్రంగి అక్టోబర్ 2 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో మహాలక్ష్మి వీధిలో మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాతను వేములవాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరికీ ఉంది అందరూ పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి యూత్ అధ్యక్షు డు గుగ్గిళ్ళ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు చేలుకల తిరుపతి, తర్రే మనోహర్, పల్లి గంగాధర్, సుర యాదయ్య, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గండి నారాయణ,తర్రే లింగం, గంధం మనోజ్, ఎర్రం గంగ నరసయ్య, ఇప్ప మహేష్, పడాల శ్రీనివాస్,గంధం శంకర్, పడాల సురేష్ తదితరులు పాల్గొన్నారు