దుర్గాదేవి కి కుంకుమ పూజ అభిషేకం*

మల్లాపూర్ (జనం సాక్షి) అక్టోబర్ :01 దుర్గా దేవి శరన్నవరాత్రుల భాగంగా ఈరోజు మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో గ్రామ అభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ అర్చకులు విద్యాధర ఆచార్య చే నిర్వహించారు .ఉదయం నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని అలంకరించి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డు సుమలత మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే గ్రామాన్ని చల్లగా ఉంచుతుందని అందరూ భక్తిశ్రద్ధలతో వచ్చి దుర్గాదేవి మండపంలో పూజలు నిర్వహించుకోవాలని కోరారు అభిషేకంలో పాల్గొన్న గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గడ్డం హనుమంత రెడ్డి ఎంపిటిసి ఉండాలా శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ మెడకోకుల శ్రీనివాస్. యువజన సంఘాల నాయకులు బొడ్డు రాజేష్ ,వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు .