దుర్గామాత పూజలో పాల్గొన్న దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్.

దౌల్తాబాద్ అక్టోబర్ 1, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గామాత పూజలో దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు దౌల్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఉమ్మడి నరసింహ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్, ఏఎంసి డైరెక్టర్ నాగరాజు,కిరణ వర్తక సంఘం అధ్యక్షులు చంద్రం గుప్తా, దుర్గామాత కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.