దూరదృష్టితో రైల్వే బడ్జెట్.. ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బ్జడెట్ ముందు చూపుతో, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రయాణికుల సౌకర్యం, ఇతర లక్ష్యాలను చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో ఈ బ్జడెట్ ఉందని అన్నారు. రైల్వే బ్జడెట్లో మొదటిసారి సాంకేతిక పరిజ్ఞానం అప్గ్రేడేషన్, రైల్వేల ఆధునికీకరణకు పెద్ద పీట వేసినట్లు మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బడ్జెట్లో అన్ని అంశాలకు ప్రాధాన్యం కల్పించారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ బడ్జెట్లో ప్రయాణికుల అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.